Sampath Nandi: సినీ ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్ వంటి హీరోలతో సినిమాలు చేయాలనుకుంటారు. ఒక్కసారి ఛాన్స్ ఇస్తే తమ టాలెంట్ని నిరూపించుకోవాలనుకుంటారు. చాలా మంది దర్శకులు ఇలానే ఉంటే.. ఓ దర్శకుడు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాడు. టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాన్ ఓ దర్శకుడికి మంచి ఆఫర్ ఇస్తే.. చేయనంటూ వెళ్లిపోయాడంట. మరి ఆ డైరెక్టర్ ఎవరో అన్న విషయానికొస్తే..
ఏమైంది ఈవేళ, రచ్చ, బెంగాల్ టైగర్ వంటి సినిమాలతో దర్శకుడు సంపత్ నంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఈ దర్శకుడికి పవన్ కల్యాణ్ స్వయంగా పిలిచి ఓ ఆఫర్ ఇచ్చారట. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా డైరెక్ట్ చేయమని చెప్పారట. ఈ మూవీ కథలో కొన్ని మార్పులు చేయమని చెప్పగా.. అతను చేసిన మార్పులు చేర్పులు పవన్కి నచ్చలేదట.
దీంతో పవన్.. మరొక వెర్షన్ రాయాలని సూచించారట. ఇక అప్పటికే ఎంతో ఇబ్బందిగా ఫీల్ అయిన సంపత్ నంది.. మీతో సినిమా చేయడం నావల్ల కాదని చెప్పేసారట. అంటే.. పవన్ కళ్యాణ్ ఇమేజ్కి తగ్గ కథను తాను రాయలేనని అన్నారట. దీంతో ఈ సినిమా నుండి ఆ దర్శకుడు పక్కకి తప్పుకున్నాడట.