Nagole Road Accident: హైదరాబాద్ నాగోల్ పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. బైకును టిప్పర్ ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కుత్బుల్లాపూర్కు చెందిన ప్రదీప్ అనే వ్యక్తి, తన తండ్రితో బైక్పై బయటకు వెళ్లాడు. నాగోల్ గౌరెల్లి పాపన్న గూడా చౌరస్తా వైపు వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన టిప్పర్ బలంగా ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో తండ్రి, కొడుకు చనిపోయారు. ప్రమాద సమయంలో టిప్పర్ క్యాబిన్లో మంటలు చెలరేగాయి. టిప్పర్ ముందు భాగం దగ్ధమవ్వడంతో పాటు బైక్ కూడా కాలి బూడిదైంది. బైక్ ను ఢీ కొట్టిన టిప్పర్ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. తండ్రి, కుమారుల మృతితో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఇంటి యజమాని, కొడుకు ఒకేసారి అనంతలోకాలకు వెళ్లిపోవడంతో.. ఆ ఇల్లాలు ఒంటరైంది. రోడ్డు ప్రమాదంలో తండ్రి,కొడుకు మరణించడంతో.. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.