Chandrababu Tour: టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ జనంలోకి వెళ్తున్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి.. మధ్యంతర బెయిల్పై విడుదలైన తర్వాత ఆస్పత్రి, ఇంటికే పరిమితమయ్యారు. శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కూడా లభించింది. ఇటీవల పుణ్యక్షేత్రాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇక మళ్లీ జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకుని.. జగన్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా.. రా కదలి రా పేరుతో 22 పార్లమెంట్ నియోజకవర్గాలను చుట్టేయనున్నారు.
నేటి నుంచి ఈ నెల 29 వరకు 22 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించి బహిరంసభలు నిర్వహించనున్నారు చంద్రబాబు. శుక్రవారం మధ్యాహ్నం 2:45 గంటలకి ఉండవల్లి నుంచి హెలికాప్టర్ ద్వారా కనిగిరి బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 3.45 గంటలకు చంద్రబాబు కనిగిరి చేరుకోనున్నారు. 4 నుంచి 6 గంటల వరకు సమర శంఖారావం బహిరంగ సభలో పాల్గొననున్నారు. సభ అనంతరం సాయంత్రం 6:15 గంటలకు కనిగిరిలోని టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు రాత్రి బస చేయనున్నారు.
.
.