Kesineni Nani: ఏపీ రాజకీయాలు ఎప్పుడెలా ఉంటాయో ఎవరి ఊహకు అంతుచిక్కడం లేదు. వైసీపీలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో చాలా మందికి సీఎం జగన్ మొండి చేయి చూపించడంతో ఆ పార్టీలో అసంతృప్తుల సంఖ్య పెరిగిపోతోంది. మరోవైపు జగన్ సోదరి షర్మిల.. వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసి.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని.. ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. షర్మిల రాకతో వైసీపీ అసంతృప్తులంతా కాంగ్రెస్ వైపు అడుగులేస్తున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి.
ఎప్పటి నుండో విజయవాడ ఎంపీ సీటుపై జరుగుతున్న రగడపై తాజాగా క్లారిటీ వచ్చింది. ఎంపీ సీటు కోసం కేశినేని బ్రదర్స్ మధ్య తీవ్ర పోటీ ఉండగా.. టీడీపీ అధిష్టానం దానిపై క్లారిటీ ఇచ్చింది. దీంతో కేశినేని బ్రదర్స్ వివాదానికి కూడా ఎండ్ కార్డు వేసింది. మరోసారి కేశినేని నానికి టికెట్ లేదని హైకమాండ్ తేల్చి చెప్పింది. అటు తిరువూరులో చంద్రబాబు సభ బాధ్యతలు కేశినేని చిన్నికి అప్పగించింది. పార్టీ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించింది.
ఆలపాటి రాజా, కొనకళ్ల నారాయణ,నెట్టెం రఘురాం.. రాత్రి కేశినేని నానిని కలిశారు. చంద్రబాబు ఆదేశాలను నానికి చేరవేశారు. పార్టీ విషయాల్లో జోక్యం చేసుకోవద్దన్న చంద్రబాబు ఆదేశాలను శిరసావహిస్తానని నాని వారితో చెప్పారు.
.
.