CM Revanth Reddy Delhi Tour : హైదరాబాద్ మెట్రో విస్తరణకు కావాల్సిన నిధులు అందించాలని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి.. కేంద్రమంత్రి హరదీప్ సింగ్ పూరీని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్… భాగ్యనగరంలో మెట్రో విస్తరణకు సంబంధించి.. పలు కీలక అంశాలను హరదీప్సింగ్కు వివరించారు.
దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని సీఎం కోరారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్రమంత్రితో CS శాంతి కుమారి కూడా సమావేశమయ్యారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్నముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిశారు. రాష్ట్రానికి ఐపీఎస్ అధికారుల కేటాయింపును పెంచాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో సమావేశమయ్యారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ లు ఉన్నారు.
.
.