South Africa vs India 2nd Test : కేప్ టౌన్ టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. సిరీస్ ను 1-1తో సమం చేసింది. రెండురోజుల్లో ముగిసిన రెండో టెస్టుల్లో సఫారీ జట్టుపై భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. 79 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 12 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి చేధించింది.
ఓపెనర్ యశస్వి జైస్వాల్ (28, 23 బంతుల్లో 6 ఫోర్లు) టీ20 తరహాలో దూకుడుగా ఆడి సఫారీ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. చివరి బర్గర్ బౌలింగ్ అవుటయ్యాడు. ఆ తర్వాత శుభ్ మన్ గిల్ (10, 11 బంతుల్లో 2 ఫోర్లు) కూడా అదే తరహా ఆడేందుకు ప్రయత్నించి రబడా బౌలింగ్ బౌల్డ్ అయ్యాడు. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ (17, 22 బంతుల్లో 2 ఫోర్లు) నిదానంగా ఆడుతూ.. కింగ్ విరాట్ కోహ్లీ(12, 11 బంతుల్లో 2 ఫోర్లు)తో కలిసి జట్టును విజయం దిశగా నడిపించాడు. విజయానికి 4 పరుగుల దూరంలో కోహ్లి అవుటయ్యాడు. అయ్యర్ (4, 6 బంతుల్లో 1 ఫోర్) తో కలిసి రోహిత్ లాంఛనం పూర్తి చేశాడు.