Kadapa : కడపజిల్లా బద్వేల్ ప్రాంతంలో సిద్దవటం రోడ్డులో అన్నదమ్ములపై దుండగులు కత్తులతో దాడి చేసారు. దాడిలో ఇద్దరు మరణఇంచారు. ఘటన స్థలంలోనే తమ్ముడు ప్రశాంత్ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మరొకర్ని ఆసుపత్రికి తరలిస్తుడంగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.
Kadapa : కడప జిల్లా బద్వేల్ ప్రాంతంలో సిద్దవటం రోడ్డులో అన్నదమ్ములపై దుండగులు కత్తులతో దాడి చేశారు. దాడిలో ఇద్దరు మరణించారు. ఘటన స్థలంలోనే తమ్ముడు ప్రశాంత్ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మరొకర్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.
స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులకు గత కొద్దిరోజులుగా మరోవర్గం వారితో వివాదాలున్నాయని స్థానికులు తెలిపారు. రియల్ ఎస్టేట్ తగాదాల నేపథ్యంలో నిందితులు దాడి చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు ప్రకటించారు.