Kishan Reddy : ఫార్మా సిటీ, మెట్రో విస్తరణ రద్దుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. ఫార్మాసిటీపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు వెనక్కి తగ్గారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మేము మాట్లాడితే మా నోరు మూయించాలని చూస్తే మరింత తిరగబడతామని సీరయస్ కామెంట్స్ చేశారు. అభయహస్తం పేరుతో చేస్తున్న దరఖాస్తుల స్వీకరణ రాజకీయ లబ్ధి కోసమే అని కిషన్ రెడ్డి విమర్శించారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ఆలస్యం చేసేందుకే దరఖాస్తులను స్వీకరిస్తున్నారన్నారు.
Kishan Reddy : ఫార్మా సిటీ, మెట్రో విస్తరణ రద్దుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. ఫార్మాసిటీపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు వెనక్కి తగ్గారని ప్రశ్నించారు. తాము మాట్లాడితే నోరు మూయించాలని చూస్తే మరింత తిరగబడతామని సీరియస్ కామెంట్స్ చేశారు. అభయహస్తం పేరుతో చేస్తున్న దరఖాస్తుల స్వీకరణ రాజకీయ లబ్ధి కోసమేనని కిషన్ రెడ్డి విమర్శించారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ఆలస్యం చేసేందుకే దరఖాస్తులను స్వీకరిస్తున్నారన్నారు.
ఎలాంటి దరఖాస్తులు లేకుండా కూడా సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చని కిషన్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో అనేక మంది రేషన్ కార్డులు లేకుండా ఉన్నారన్నారు. అసలు కార్డులే లేకుండా దరఖాస్తులకు ఎలా జత చేయాలని ప్రశ్నించారు.
బీఆర్ఎస్తో సీఎం రేవంత్ రెడ్డికి వ్యాపార సంబంధాలు ఉన్నాయని కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ అవసరం ఎవరికీ లేదన్నారు. ప్రజలు కూడా మళ్లీ కేసీఆర్ గెలవాలని కోరుకోవడం లేదని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ ఓటు వేస్తే అది చెత్త బుట్టలో వేసినట్లే అని కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.