Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం పలు చిత్రాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే ‘ఖుషి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. దీంతో ఇప్పుడు ఆమె నెక్స్ట్ మూవీపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో ఓ వార్త ఆమె అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతోంది. ఆమె ఓ స్టార్ హీరోతో జోడి కట్టనున్నట్లు తెలుస్తోంది.
హీరో సల్మాన్ ఖాన్ – తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ కాంబినేషన్లో ‘ది బుల్’ అనే చిత్రం భారీ అంచనాలతో తెరకెక్కుతోంది. 1988 ఆపరేషన్ కాక్టస్ అనే కాన్సెప్ట్తో దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమా ఫస్ట్లుక్, టైటిల్ రివిల్ పోస్టర్ని రిలీజ్ చేయగా.. అందరినీ ఆకట్టుకుంది. ఇదివరకు ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన త్రిష నటిస్తున్నట్లు వార్తలు జోరుగా వినిపించాయి. అంతేకాకుండా ఇందులో ఆమె పాత్రకి మంచి ప్రాధాన్యత ఉంటుందని కూడా టాక్ నడిచింది. ఈ తరుణంలో మరో వార్త చక్కర్లు కొడుతోంది.
ఈ మూవీలో త్రిష స్థానంలో టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ సమంతను తీసుకోబోతున్నారట. ఇప్పుడు ఈ వార్త హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం త్రిష అజిత్, చిరంజీవి సినిమాలతో బిజీగా ఉండటంతో.. ‘ది బుల్’ చిత్రానికి డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయారట. అందువల్లనే ఈ ప్రాజెక్ట్ నుంచి త్రిషను తప్పించి.. ఆమె స్థానంలో సమంతను తీసుకున్నట్లు సినీ వర్గాల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.