EPAPER

Chandrababu : నిధుల్లేని బీసీ కార్పొరేషన్లతో ఏం లాభం?.. వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్..

Chandrababu : నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలంటే అవకాశం రావాలి.. అలా రాకపోతే ఎవరూ నాయకుడిగా మారలేరని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు కృషి చేశానన్నారు. ఆదాయం పెంచే మార్గాలను సూచించానని బాబు గుర్తు చేశారు. ఎన్టీఆర్‌ భవన్‌లో నిర్వహించిన ‘జయహో బీసీ’ సదస్సులో ఆయన మాట్లాడారు.

Chandrababu : నిధుల్లేని బీసీ కార్పొరేషన్లతో ఏం లాభం?..  వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్..

Chandrababu : నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలంటే అవకాశం రావాలి.. అలా రాకపోతే ఎవరూ నాయకుడిగా మారలేరని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు కృషి చేశానన్నారు. ఆదాయం పెంచే మార్గాలను సూచించానని బాబు గుర్తు చేశారు. ఎన్టీఆర్‌ భవన్‌లో నిర్వహించిన ‘జయహో బీసీ’ సదస్సులో ఆయన మాట్లాడారు.


టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆదరణ కార్యక్రమంతో బీసీలను ఆదుకున్నామని చంద్రబాబు అన్నారు. 90 శాతం సబ్సిడీతో లబ్ధిదారులకు పరికరాలు అందజేశామని తెలిపారు. 125 కులాలకు ఆర్థికసాయం చేసిన పార్టీ టీడీపీ అన్నారు. కార్పొరేషన్ల ద్వారా రూ.3,500 కోట్లు ఖర్చు చేశామన్నారు. రూ.75 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పిన జగన్ నాలుగేళ్లలో బీసీలకు ఒక్క రూపాయి అయినా జగన్‌ ఇచ్చారా? అని బాబు ప్రశ్నించారు. కార్పొరేషన్లు పెట్టి నిధులు లేకపోతే లాభమేంటి? ఆయన ప్రశ్నించారు. రూ.వందల కోట్ల విలువ చేసే పరికరాలను వైసీపీ ప్రభుత్వం గోదాముల్లో ఉంచేసిందన్నారు. వాటిని తుప్పు పట్టేలా మార్చారు తప్ప పేదలకు ఇవ్వలేదని బాబు విమర్శించారు.

వైసీపీ ప్రభుత్వం రాగానే 34 శాతం ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గించారని చంద్రబాబు తెలిపారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లను రద్దు చేశారన్నారు. కనీసం బీసీ భవనాలను కూడా పూర్తిచేయలేకపోయారన్నారు. మూడు రాజధానులు కాదు.. రాష్ట్రానికి అమరావతి ఒకటే రాజధాని.. దాన్ని పూర్తి చేసి తీరుతామని బాబు అన్నారు. బీసీలకు ఏం చేశారని వైసీపీ నేతలు సాధికార యాత్ర చేపడుతున్నారని చంద్రబాబు నిలదీశారు.


Related News

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు విప్పు జగన్.. ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

Big Stories

×