EPAPER

Chittoor : పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్య.. కారణమేంటి.. ?

Chittoor : పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్య.. కారణమేంటి.. ?

Chittoor : తల్లిదండ్రులు తమ పిల్లలకు కష్టం తెలియకుండా చదివిస్తారు. కానీ విద్యార్థులు చిన్న చిన్న విషయాలకు మనస్తాపానికి గురై ఆత్యహత్యలు చేసుకుంటున్నారు.ఇలాంటి ఘటనే చిత్తూరు జిల్లా పలమనేరులో చోటుచేసుకుంది. మహిళా పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్లో ఓ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.


శ్రీరంగరాజపురం మండలానికి చెందిన రసజ్ఞ (16) పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. గురువారం ఉదయం తోటి విద్యార్థులు కళాశాలకు వెళ్లగా హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన సిబ్బంది హుటాహుటిన పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రసజ్ఞ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

ఘటన స్థలానికి చేరుకున్న డీఎస్పీ సుధాకర్ రెడ్డి పరిస్థితిని సమీక్షించారు. పాలిటెక్నిక్ కళాశాలలో రసజ్ఞ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందన్న సమాచారంతో ఘటనా ప్రాంతానికి చేరుకుని విచారణ చేపట్టామని సీఐ చంద్రశేఖర్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామన్నారు. దర్యాప్తు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×