ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అనకాపల్లి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. మంత్రి పదవిని చేపట్టారు. ఈ ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. వైసీపీ అధినేత, సీఎం జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గాల వారిగా సమీక్షలు జరుపుతూ.. కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థుల్ని మార్చుతున్నారు.
వైనాట్ 175 చార్గెట్ గా నియోజకవర్గాలకు కొత్త ఇన్ చార్జులను నియమించారు. ఈ క్రమంలో అనకాపల్లి నియోజకవర్గానికి మలసాల భరత్ ను నియమించారు. అమర్నాథ్ కు సంబంధించి వైసీపీ అధిష్టానం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎలాంటి బాధ్యతలను అప్పగించలేదు. సిట్టింగ్ స్థానమైన అనకాపల్లిని వీడిటంపై మంత్రి అమర్నాథ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రాజకీయంగా తనకు పునర్జన్మ ఇచ్చిన అనకాపల్లి ప్రజల్ని వదిలి వెళ్లలేనంటూ కన్నీరు పెట్టుకున్నారు. అనకాపల్లి నియోజకవర్గ వైసీపీ కొత్త ఇన్ చార్జ్ మలసాల భరత్ ను పరిచయం చేస్తూ.. మంత్రి అమర్నాథ్ బోరున ఏడ్చారు.
.
.