Tiruvuru : తిరువూరు టీడీపీ కార్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తిరువూరు టీడీపీ విసృతస్ధాయి సమావేశం రసాభసా మారింది. సమావేశం ప్రాంగణంలో కేశినేని నాని వర్గీయులు ఫ్లెక్సీలను చింపి, కుర్చీలు ధ్వంసం చేశారు. కేశినేని శివనాథ్, చిన్ని ఫోటోలున్న ప్లెక్సీలు చూడగానే నాని వర్గీయులు రెచ్చిపోయారు. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో తన వర్గీయులను కేశినేని శివనాథ్ వెనక్కి పిలిపించుకున్నారు. కేశినేని చిన్ని ఫొటో ఎందుకు వేశావంటూ టీడీపీ ఇంచార్జి శావల్ దత్ పైకి నాని వర్గీయులు దూసుకెళ్లారు. అడ్డుకోవడానికి వెళ్లిన పోలీసులపై దాడి చేయడంతో సీఐ తలకు బలమైన గాయాలయ్యాయి.
చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన బ్యానర్ పై కేశినేని నాని ఫొటో లేకపోవడంతో ఆయన వర్గం ఆందోళనకు దిగింది. ఈ నెల 7న చంద్రబాబు పర్యటనలో భాగంగా కేసినేని నాని చంద్రబాబు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించడానికి వచ్చారు. బ్యానర్ పై నాని ఫోటో లేదని నాని వర్గం ఆందోళన చేసింది. టీడీపీ కార్యాలయంలో నాని వర్గం ఘర్షణకు దిగింది. మా నాయకుడి ఫొటో పెట్టలేదని, బ్యానర్లను చించేశారరు. కుర్చీలను ధ్వంసం చేశారు.