EPAPER
Kirrak Couples Episode 1

Hardeep Singh Puri : చమురు ధరలు తగ్గుతాయని వార్తలు.. కేంద్ర మంత్రి క్లారిటీ..

Hardeep Singh Puri on Fuel Price Reduction : చమురు ధరల తగ్గిస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురీ స్పష్టత నిచ్చారు. సార్వత్రిక ఎన్నికల ముందు చమురు ధరలను కేంద్రం తగ్గిస్తుందంటూ వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. చమురు ధరల తగ్గింపుపై జరుగుతున్న ప్రచారం అనేది పూర్తిగా ఊహాజనితమన్నారు. చమురు ధరల తగ్గింపుపై ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలతో ఎలాంటి చర్చలూ జరగలేదని మంత్రి స్పష్టత నిచ్చారు. ఓ వైపు అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్నాయి, మరో వైపు సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గిస్తుందంటూ వార్తలు వచ్చాయని మంత్రి హర్దీప్ సింగ్ తెలిపారు.

Hardeep Singh Puri :  చమురు ధరలు తగ్గుతాయని వార్తలు.. కేంద్ర మంత్రి క్లారిటీ..

Hardeep Singh Puri on Fuel Price Reduction : చమురు ధరల తగ్గిస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురీ స్పష్టత నిచ్చారు. సార్వత్రిక ఎన్నికల ముందు చమురు ధరలను కేంద్రం తగ్గిస్తుందంటూ వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. చమురు ధరల తగ్గింపుపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా ఊహాజనితమన్నారు. చమురు ధరల తగ్గింపుపై ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలతో ఎలాంటి చర్చలూ జరగలేదని మంత్రి స్పష్టత నిచ్చారు. ఓ వైపు అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్నాయి, మరో వైపు సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గిస్తుందంటూ వార్తలు వచ్చాయని మంత్రి హర్దీప్ సింగ్ తెలిపారు.


లీటర్‌కు రూ.6 మేర తగ్గే అవకాశం ఉందని ప్రచారం జరిగిందని మంత్రి హర్దీప్ సింగ్ తెలిపారు. ఒకప్పటితో పోలిస్తే చమురు ధరలు గరిష్ఠాల నుంచి భారీగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆ మేర వినియోగదారులకు ప్రయోజనాన్ని బదిలీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోందంటూ వార్తలు వచ్చాయన్నారు. అయితే అలాంటిదేమీ లేదంటూ ఖండించారు. అంతర్జాతీయంగా చమురు ధరలు ఒడుదొడుకుల కారణంగా అటు అభివృద్ధి చెందిన, పొరుగు దేశాల్లో సైతం ధరలు అమాంతం పెరిగాయని మంత్రి హర్దీప్ సింగ్ పురీ అన్నారు. భారత్‌లో మాత్రం ధరలు స్థిరంగా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.

దక్షిణాసియా దేశాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 40-80 శాతం మేర పెరిగాయని మంత్రి హర్దీప్ సింగ్ అన్నారు. పశ్చిమ దేశాల్లోనూ ధరలు పెరిగాయని చెప్పారు. అదే సమయంలో భారత్‌లో 2021 నవంబర్‌, 2022 మే నెలలో రెండు సార్లు చమురు ధరలు తగ్గాయని మంత్రి గుర్తు చేశారు. భారత్‌ ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు, ఎల్పీజీ దిగుమతిదారుగా ఉందని మంత్రి పురీ చెప్పారు. రిఫైనరీ, ఆటోమొబైల్‌, ఎల్‌ఎన్‌జీ దిగుమతిలో మార్కెట్‌ పరంగా నాలుగో స్థానంలో ఉందన్నారు.


ప్రపంచ మార్కెట్‌లో ఎప్పడికప్పుడు చమురు ధరలు తీవ్రమైన ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయని మంత్రి హర్దీప్ సింగ్ పేర్కొన్నారు. అలాంటి స్థితిలో ఏ ప్రభుత్వానికి అయినా చమురు ధరలు తగ్గించడం కష్టంతో కూడుకున్న వ్యవహారమని మంత్రి తెలిపారు. అయితే ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలతో చమురు ధరల తగ్గింపుపై ఎలాంటి సంప్రదింపులూ జరగలేదని చెప్పారు. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు లాభాలు ప్రకటించినప్పటికీ.. చమురు ధరలు గరిష్ఠంగా ఉన్న సమయంలో రిఫైనరీలు భారీ నష్టాలు చవిచూశాయన్న అంశాన్ని మంత్రి హర్దీప్ సింగ్ పురీ గుర్తుచేశారు.

Tags

Related News

Love Signs: ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడుతుంటే వారిలో మీకు ఈ ఐదు లక్షణాలు కనిపిస్తాయి, మనస్తత్వశాస్త్రం చెబుతున్నది ఇదే

Trinayani Serial Today September 21st: ‘త్రినయని’ సీరియల్‌: డీల్ కోసం ఇంటికి వచ్చిన గజగండ – గజగండను చంపే ప్రయత్నం చేసిన గాయత్రిదేవి, నయని

Nindu Noorella Saavasam Serial Today September 21st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరు ఆత్మను చూసిన మనోహరి – అంజును చూసి ఎమోషన్ అయిన ఆరు

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Big Stories

×