Vyuham Petition: వ్యూహం సినిమా విడుదలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ ను సవాల్ చేస్తూ.. నిర్మాత దాసరి కిరణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. సినిమా విడుదల కాకపోవడంతో రూ.కోట్లలో నష్టం జరిగిందని నిర్మాత తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వ్యూహం సినిమాకు సంబంధం లేని వ్యక్తులు పిటిషన్ వేశారని వాదనలు వినిపించారు.
జనవరి 11వ తేదీ వరకూ వ్యూహం సినిమా విడుదలను నిలిపివేస్తూ.. కొద్దిరోజుల క్రితం సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 11కు బదులుగా 8నే విచారణ చేయాలని సినిమా యూనిట్ కోరింది. మెరిట్స్ ఆధారంగా సినిమా విడుదలపై నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జ్.. డివిజన్ బెంచ్ కు విజ్ఞప్తి చేసింది. దీనిపై స్పందించిన హైకోర్టు.. సింగిల్ బెంచ్ లోనే తేల్చుకోవాలని పిటిషనర్ కు స్పష్టం చేసింది. తెలంగాణ హైకోర్టులో వ్యూహం విడుదలకు లైన్ క్లియర్ అవుతుందనుకున్న ఆర్జీవీకి నిరాశ ఎదురైంది.