ప్రముఖ రాజకీయ, ఆర్థిక అంశాల విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి.. నరసాపురం మాజీ ఎమ్మెల్యే పరకాల కాళికాంబ (94) అనారోగ్యంతో కన్నుమూశారు. గండిపేట మండలం మంచిరేవుల గ్రామంలో ఆమె మరణించారు. పరకాల కాళికాంబ.. మాజీ మంత్రి పరకాల శేషావతారం భార్యగా రాజకీయాల్లోకి వచ్చారు. 1981లో జరిగిన ఉపఎన్నికలో నరసాపురం ఎమ్మెల్యేగా గెలిచారామె.
శేషావతారం – కాళికాంబ దంపతులకు నలుగురు సంతానం. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వారిలో పెద్ద కుమారుడు పరకాల ప్రభాకర్ – పెద్ద కోడలు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులంతా పరకాల కాళికాంబ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.