మాయల మరాఠీ స్వర్గసీమ సుకేతన చండ్ర చంద్రశేఖర్ గురించి తవ్వే కొద్దీ వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ ముసుగులో చంద్రశేఖర్ చేసే అరాచకాలను బిగ్టీవీ.. పక్కా ఆధారాలతో బయటపెడుతోంది. సుకేతన వెంచర్కు భూములు ఇచ్చిన వారి మధ్య ఎన్నో ఏళ్లుగా వివాదం నడుస్తోంది. చెర్కుపల్లిలో చండ్ర చంద్రశేఖర్ వెంచర్లు వేశారు. ఆ వెంచర్లు శంషాబాద్ ఎయిర్పోర్టు, సాఫ్ట్వేర్ కంపెనీలకు దగ్గరగా ఉందంటూ చంద్రశేఖర్ విపరీతంగా ప్రచారం చేశారు. కానీ ఆయన చేస్తున్న ప్రచారమంతా అబద్ధమేనని అంటున్నారు. చెర్కుపల్లి స్థానికులు. చెర్కుపల్లిలో ఉండే వెంచర్లు సాఫ్ట్వేర్ కంపెనీలకు 30 కిలోమీటర్లు, శంషాబాద్ ఎయిర్పోర్టుకు 60 నుంచి 70 కిలోమీటర్ల దూరం ఉందని చెబుతున్నారు. అంత దూరంలో ఉండే భూమిని తక్కువ ధరకు కొని ఇప్పుడు గజం 12 వేలకు సుకేతన వెంచర్ వాళ్లు విక్రయిస్తున్నారని అంటున్నారు. ప్రజలకు మాయమాటలు చెప్పి వెంచర్లు కొనిపిస్తున్నారని.. రియల్ ఎస్టేట్ ముసుగులో దందా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
మామూలుగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా గజం 10వేలకు దొరికే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎక్కడో సిటీకి 60, 70 కిలోమీటర్ల దూరంలో, ఎలాంటి అభివృద్ధి లేని స్థలాల్లో గజం 12 వేలకు అమ్మడంపై.. తెలంగాణ రియల్టర్ అసోసియేషన్ సభ్యులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సుకేతన వెంచర్లలో ప్లాట్లు అమ్ముకోవడానికి చండ్ర చంద్రశేఖర్ మామూలుగా ఖర్చు పెట్టడం లేదు. ఆయన వెంచర్ ప్రమోషన్ల కోసం పెట్టే ఖర్చు చూస్తే ఎవరికైనా కళ్లు బైర్లు కమ్మాల్సిందే. పేపర్లతో మొదలుకుని టీవీ ఛానెళ్లు, FM రేడియోలు, సిటీలో పలు మెయిన్ ప్లేస్లో హోర్డింగులకే కోట్లు గుమ్మరిస్తున్నారు.
5 FM ఛానెళ్లలో రోజుకు 300 సార్లు వినిపించేలా ప్రకటనలు ఇస్తున్నారు. 15 నుంచి 20 సెకన్లపాటు ఉండే యాడ్కు 50 రూపాయాలు ఇస్తున్నారు. అంటే రోజుకు సుమారు లక్ష రూపాయలు FMకు ఖర్చు పెడుతున్నారు. ఇక టీవీ ప్రకటనలైతే 5 నుంచి 8 ఛానళ్లకు.. నెలకు కోటి రూపాయల బడ్జెట్ కేటాయిస్తున్నారు. వారానికి 2 సార్లు 6 తెలుగు వార్తా పత్రికలు, ఒక ఆంగ్ల పత్రికకు కలిపి కోటిన్నర ఖర్చుపెడుతున్నారు. అవుట్ డోర్ మీడియా హోర్డింగ్స్కు నెలకు 50 లక్షలు ఇస్తున్నారు. షాద్ నగర్ నుంచి వెంచర్ వరకు అనధికార హోర్డింగ్స్తో 500 మీటర్లకు ఒక్కటి చొప్పున ఉచిత ప్రచారానికి మూడున్నర కోట్లు పెడుతున్నాడు. అయితే ఇంత డబ్బు అతనికి ఎక్కడి నుంచి వస్తోంది..? ఇందులో బ్లాక్ మని ఎంత ..? వైట్ మనీ ఎంత..? మరి వీటికి లెక్కలు ఉన్నాయా..?ప్రచారమైతే కళ్ల ముందు కనిపిస్తోంది. ఖర్చంతా పద్ధతి ప్రకారమే నడుస్తోందా..? అన్న అనుమానాలు వస్తున్నాయి.
.
.