EPAPER

Jagan-Sharmila: తాడేపల్లిలో నేడు ఆత్మీయ దృశ్యం.. రెండేళ్ల తర్వాత కలుస్తున్న జగన్-షర్మిల

Jagan-Sharmila: తాడేపల్లిలో నేడు ఆత్మీయ దృశ్యం.. రెండేళ్ల తర్వాత కలుస్తున్న జగన్-షర్మిల
YS Jagan-Sharmila news

YS Jagan-Sharmila news(Andhra pradesh political news today):


ఏపీ రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇవాళ ఏపీ సీఎం జగన్‌ను సోదరి షర్మిల కలవనున్నారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహానికి అన్నను ఆహ్వానించనుంది. పెళ్లికి ఆహ్వానించించడం వ్యక్తిగతమైన అంశమే అయినా.. షర్మిల, జగన్ భేటీ అక్కడి వరకే ఆగిపోతుందా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. షర్మిల కాంగ్రెస్‌లో చేరడం వైసీపీ గెలుపు, ఓటములను ప్రభావితం చేస్తుందనడంలో అనుమానం లేదు. కాబట్టి.. జగన్.. షర్మిలతో రాజకీయాలపై చర్చించకుండా ఉంటారా? అనే చర్చ నడుస్తోంది.

ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డితో జగన్ రాయబారాన్ని పంపారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ రాయబారం విఫలమైన తర్వాతే షర్మిల కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ప్రకటించారని తెలుస్తోంది. కుమారుడి వివాహ ఆహ్వన పత్రికను ఇవ్వనున్న షర్మిలతో జగన్ డైరెక్ట్‌గా రాజకీయాలపై చర్చించకపోతారా? అని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఓవైపు చంద్రబాబు, పవన్.. జగన్ పై ముప్పేటదాడి చేస్తున్నారు. ఈ టైంలో షర్మిల కాంగ్రెస్‌లో చేరితే.. హస్తం పార్టీకి ఓటు బ్యాంక్ పెరుగుతోంది. అది కూడా వైసీపీ ఓట్లే చీలుతాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాబట్టి నష్టనివారణలో భాగంగా జగన్.. షర్మిలతో చర్చించి చివరి ప్రయత్నం చేస్తారేమో అని వైసీపీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.


షర్మిలతో జగన్ రాజకీయాలు మాట్లాడటం ఓ ఎత్తు అయితే.. షర్మిల రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది కూడా చర్చ నీయాంశంగా మారింది. షర్మిల కేవలం కొడుకు పెళ్లికి అన్నను ఆహ్వానించాడానికే వెళ్తుంది తప్పా రాజకీయాలను ప్రస్తావనకు తీసుకురాదని కాంగ్రెస్, వైఎస్సార్ టీపీ వర్గాలు భావిస్తున్నాయి. షర్మిల బాగా ఆలోచించే.. కాంగ్రెస్‌లో చేరుతానని ప్రకటించారని.. ఇక రాజకీయంగా వెనకడుగు వేయరని వైఎస్సార్టీపీ కార్యకర్తలు అంటున్నారు.

Related News

MLA Adimulam case: ఎమ్మెల్యే ఆదిమూలం కేసు కొత్త మలుపు.. అసలేం జరుగుతోంది?

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Big Stories

×