CM Revanth reddy : మెట్రో రైలు రెండోదశ ప్రతిపాదనలపై డీపీఆర్, ట్రాఫిక్ స్టడీస్ త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. మెట్రో విస్తరణపై సీఎం.. సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. రాయదుర్గం-ఎయిర్పోర్టు మెట్రో ప్రతిపాదనను పెండింగ్లో పెట్టాలని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న మార్గాలు, కొత్త ప్రణాళికలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఎల్బీనగర్-హయత్నగర్, మియాపూర్-పటాన్చెరు, రాయదుర్గం-ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఎంజీబీఎస్-ఎయిర్పోర్టు మార్గాల్లో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పాతబస్తీ మెట్రోపై స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించాలని సూచించారు. మత పరమైన, చారిత్రక కట్టడాలపై ఎలాంటి ప్రభావం పడకుండా రోడ్డు విస్తరణ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.