Sankranti Special Trains: సంక్రాంతి పండుగ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే 32 స్పెషల్ ట్రైన్ లను నడపనుంది. పండుగకు సొంత ఊళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం పలు మార్గాల్లో ఈ స్పెషల్ ట్రైన్లను ఏర్పాటు చేసినట్లు సికింద్రాబాద్ రైల్వే అధికారులు ప్రకటించారు.
Sankranti Special Trains: సంక్రాంతి పండుగ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే 32 స్పెషల్ ట్రైన్ లను నడపనుంది. పండుగకు సొంత ఊళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం పలు మార్గాల్లో ఈ స్పెషల్ ట్రైన్లను ఏర్పాటు చేసినట్లు సికింద్రాబాద్ రైల్వే అధికారులు ప్రకటించారు.
సికింద్రాబాద్-కాకినాడ టౌన్, సికింద్రాబాద్-బ్రహ్మపుర్, బ్రహ్మపుర్-వికారాబాద్, విశాఖపట్నం-కర్నూలు సిటీ, శ్రీకాకుళం-వికారాబాద్, సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-నర్సాపూర్ రూట్లలో ఈ రైళ్లు నడవనున్నాయి. జనవరి 7వ తేదీ నుంచి జనవరి 27 మధ్య వివిధ తేదీల్లో ఈ రైళ్లు వివిధ మార్గాలలో రాకపోకలు కొనసాగించనున్నాయి. ఈ స్పెషల్ రైళ్లల్లో ఫస్ట్ ఏసీ, సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
స్పెషల్ రెళ్లకు సంబంధించి పూర్తి వివరాలు రైల్వే వెబ్సైట్ లో చూడవచ్చని రైల్వే అధికారులు తెలిపారు.