Ponnam Prabhakar : ప్రజా పాలన సదస్సు పొడిగింపు ఉండదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలపై రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు కూడా గడవక ముందే బీఆర్ఎస్ నేతలు ఎందుకంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు.
Ponnam Prabhakar : ప్రజా పాలన సదస్సులకు సమయం పొడిగింపు ఉండదని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు కూడా గడవక ముందే బీఆర్ఎస్ నేతలు ఎందుకంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు.
బీఆర్ఎస్, బీజేపీలు రెండూ ఒకటేనని పొన్నం స్పష్టం చేశారు. ఆ పార్టీలకు ప్రాజెక్టులపై అవగాహన లేదన్నారు. కిషన్ రెడ్డి.. కేసీఆర్కు బినామీ అని అందరికి తెలుసని పొన్నం ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ను రక్షించేందుకే కిషన్ రెడ్డి సీబీఐ విచారణ కోరుతున్నారని మండిపడ్డారు.
మరోవైపు ప్రజా పాలన..అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ గడుపు పొడిగింపుపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 6వ తేదీ లోపే దరఖాస్తులు సమర్పించాలని కోరారు. గడుపు పొడిగింపు ఏమీ ఉండదని తేల్చి చెప్పారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.