Chinmayi : కోలీవుడ్ సినీ గేయ రచయిత వైరముత్తుతో కలిసి తమిళనాడు కు చెందిన కొందరు ప్రముఖ నేతలు ఒకే వేదికపై కనిపించడంతో సింగర్ చిన్మయి విస్మయం వ్యక్తంచేశారు.కోలీవుడ్ సినీ గేయ రచయిత వైరముత్తుతో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ప్రముఖ నటుడు కమల్ హాసన్, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం, ఒకే వేదికపై కనిపించారు. ఈ నేపథ్యంలో స్పందించారు.
Chinmayi : కోలీవుడ్ సినీ గేయ రచయిత వైరముత్తుతో కలిసి తమిళనాడు కు చెందిన కొందరు ప్రముఖ నేతలు ఒకే వేదికపై కనిపించడంతో సింగర్ చిన్మయి అసహనం వ్యక్తంచేశారు. కోలీవుడ్ సినీ గేయ రచయిత వైరముత్తుతో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ప్రముఖ నటుడు కమల్ హాసన్, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం, ఒకే వేదికపై కనిపించారు. ఈ నేపథ్యంలో స్పందించారు.
నన్ను వేధింపులకు గురిచేసిన వ్యక్తితో కలిసి తమిళనాడుకు చెందిన కొందరు ప్రముఖులు వేదికపై ఉన్నారన్నారు. అతడి గురించి బయటకు చెప్పిన నేను మాత్రం నిషేధానికి గురయ్యానన్నది. కొన్నేళ్ల పాటు నా వృత్తి జీవితాన్ని కోల్పోయానని తెలిపారు. నా కోరిక నెరవేరేవరకు ప్రార్ధించడం మినహా నేను చేసేది ఏమీలేదని చిన్మయి విస్మయం వ్యక్తం చేశారు.వైరముత్తు రచించిన ‘మహా కవితాయ్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో భాగంగా వీరంతా ఒకే వేదికపై కనిపించారు. స్టాలిన్, చిదంబరం ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. వారి పక్కనే కమల్ హాసన్ నిల్చొని ఉన్నారు.
దక్షిణాదిలో ఎన్నో చిత్రాల్లో మనసుని హత్తుకునే పాటలు పాడి గాయని గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్గా మంచి పేరు అందుకున్నారు చిన్మయి. విదేశాల్లో ప్రోగ్రామ్ కోసం వెళ్లినప్పుడు వైరముత్తు నన్ను వేధింపులకు గురి చేశాడని ఆరోపిస్తూ మీటూ వేదికగా ఆమె షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అతడు చెప్పిన మాటలు విననందుకు తన కెరీర్పైనే దెబ్బ కొట్టాడని ఆమె ఆరోపించారు. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ను కోరానని చిన్మయి తెలిపారు.