Hyderabad: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మోటారు వాహనాల చట్టం సవరణను నిరసిస్తూ తెలంగాణలో పెట్రోల్, ఆయిల్ ట్యాంకర్ల యజమానులు చేపట్టిన ధర్నాను విరమించారు. దీంతో ట్యాంకర్లు యథావిధిగా నడుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి ఆయిల్ ట్యాంకర్ల యజమానులు ధర్నాకు దిగడంతో పలు పెట్రోల్ బంకుల వద్ద పెట్రోల్, డీజిల్ లేక బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. దీంతో వాహనదారులు బంకుల వద్ద భారీగా బారులు తీరారు.
Hyderabad: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మోటారు వాహనాల చట్టం సవరణను నిరసిస్తూ తెలంగాణలో పెట్రోల్, ఆయిల్ ట్యాంకర్ల యజమానులు చేపట్టిన ధర్నాను విరమించారు. దీంతో ట్యాంకర్లు యథావిధిగా నడుస్తున్నాయి.
మంగళవారం ఉదయం నుంచి ఆయిల్ ట్యాంకర్ల యజమానులు ధర్నాకు దిగడంతో పలు పెట్రోల్ బంకుల వద్ద పెట్రోల్, డీజిల్ లేక బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. దీంతో వాహనదారులు పెట్రోల్ కొరతతో బంకుల వద్ద భారీగా బారులు తీరారు. మరోవైపు పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గుతాయన్న వార్తలతో బంకుల యాజమానులు పుల్ స్టాక్ వేయించుకోలేదు. దీంతో పెట్రోల్, డీజిల్ తగ్గినంత స్టాక్ లేదు. ఇంకోవైపు ట్యాంకర్ల సమ్మె తో వాహనదారులు బంకులకు పోటెత్తారు. ఈ నేపథ్యంలో బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు పెట్టారు.
పార్లమెంట్లో నూతనంగా ప్రవేశపెట్టిన భారతీయ న్యాయ సంహిత -2023 మోటారు వాహనాలు హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని నిరసిస్తూ లారీ డ్రైవర్లు ఆయిల్ ట్యాంకర్లను నిలిపివేశారు. దీంతో నగరవ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ కొరత ఏర్పడింది.