East Godavari: తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండల పరిధిలోని బంధపురం వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
East Godavari : తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండల పరిధిలోని బంధపురం వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
కారు టైరు పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టైర్ పేలిన కారు డివైడర్ అవతలి వైపు వెళ్తొన్న మరో కారును ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన స్థలంలోనే ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అదే మార్గంలో వెళ్తున్న గోపాలపురం ఎమ్మెల్యే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు క్షతగాత్రులను చికిత్స కోసం దేవరపల్లి, కొవ్వూరు, గోపాలపురం ఆస్పత్రులకు తరలించారు.