Hyderabad:పెండింగ్ చలాన్లను క్లియర్ చేయటానికి వాహనాదారులకు తెలంగాణ ప్రభుత్వం భారీ రాయితీ ప్రకటించింది. దీన్ని అవకాశంగా తీసుకొని మోసగాళ్లు సైబర్ నేరానికి తెర లేపారు. ప్రజలను మోసం చేస్తున్నారు. ఏకంగా ఫేక్ వెబ్సైట్ను క్రియెట్ చేశారు. www.echallantspolice.in పేరుతో నకీలీ వెబ్ సైట్ తో కేటుగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారు. పోలీసులు గుర్తించి ప్రజలను అప్రమత్తం చేశారు.
Hyderabad:పెండింగ్ చలాన్లను క్లియర్ చేయటానికి వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం భారీ రాయితీ ప్రకటించింది. దీన్ని అవకాశంగా తీసుకొని మోసగాళ్లు సైబర్ నేరానికి తెర లేపారు. ప్రజలను మోసం చేస్తున్నారు. ఏకంగా ఫేక్ వెబ్సైట్ను క్రియెట్ చేశారు. www.echallantspolice.in పేరుతో నకిలీ వెబ్ సైట్ తో కేటుగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారు. పోలీసులు గుర్తించి ప్రజలను అప్రమత్తం చేశారు.
పోలీసు శాఖకు చెందిన www.echallan.tspolice.gov.in/publicview వెబ్ సైట్ లో మాత్రమే చెల్లించాలని సూచించారు. ఆన్ లైన్, మీసేవ సెంటర్లలో కూడా పెండింగ్ చలాన్లు క్లియర్ చేయవచ్చు అని పోలీసులు ప్రకటించారు.
రాయితీ ఆఫర్కు భారీగా స్పందన వస్తుంది. ఈ నెల 10వ తేదీ వరకు ఈ ఆఫర్ కొనసాగనుంది. దీన్ని అదునుగా తీసుకున్న సైబర్ నేరగాళ్లు రెచ్చిపొతున్నారు. నకిలీ వెబ్సైబ్ సృష్టించి వాహనదారులను మోసం చేస్తున్నారు. ఫేక్వెబ్ సైట్లను గుర్తించిన అధికారులు వాహనదారులను అప్రమత్తం చేశారు.ఫేక్ వెబ్సైట్లో డబ్బులు చెల్లించి ప్రజలు మోసపొవద్దని పోలీసులు హెచ్చరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.