Manipur : మణిపుర్లో మరోసారి శాంతి భద్రతలు అదుపు తప్పాయి. మయన్మార్ సరిహద్దులో ఉన్న మోరే నగరంలో మిలిటెంట్లు ఒక్కసారిగా రెచ్చిపోయారు. పోలీసు కమాండోలపై మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో నలుగురు పోలీస్ కమోండోలు, ముగ్గురు BSF జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపారు. ఇక గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
Manipur : మణిపుర్లో మరోసారి శాంతి భద్రతలు అదుపు తప్పాయి. మయన్మార్ సరిహద్దులో ఉన్న మోరే నగరంలో మిలిటెంట్లు ఒక్కసారిగా రెచ్చిపోయారు. పోలీసు కమాండోలపై మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో నలుగురు పోలీస్ కమోండోలు, ముగ్గురు BSF జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపారు. ఇక గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
నిన్నటి నుంచి మణిపుర్లో పరిస్తితులు అదుపు తప్పాయి. థౌబాల్ జిల్లాలో నూతన సంవత్సర వేడుకల్లో సామాన్య పౌరులపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. భద్రతా బలగాల దుస్తులు వేసుకొని వచ్చి దుండగులు కాల్పులకు తెగబడ్డారు. నిన్న సామాన్య ప్రజానికంపై దాడి చేసిన మిలటెంట్లు.. ఇవాళ ఏకంగా భద్రతా బలగాలను టార్గెట్ చేశారు. ఈ ఘటనతో థౌబాల్, ఇంఫాల్ తూర్పు, పశ్చిమ, కాక్చింగ్, బిష్ణుపుర్ జిల్లాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది.