Nara Bhuvaneshwari : టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమం మళ్లీ చేపట్టబోతున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత మనస్తాపానికి గురై మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శిస్తారు. వారానికి మూడు రోజులపాటు నిజం గెలవాలి కార్యక్రమం చేపడతారు. జనవరి 3న ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటన ప్రారంభిస్తారు.
జనవరి 3న విజయనగరం, జనవరి 4న శ్రీకాకుళం, జనవరి 5న విశాఖపట్నం జిల్లాల్లో నారా భువనేశ్వరి పర్యటిస్తారు. ఇప్పటికే చాలా మంది బాధితుల కుటుంబాలను పరామర్శించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ అప్పుడు ‘నిజం గెలవాలి’ యాత్రను భువనేశ్వరి చేపట్టారు. చంద్రబాబు విడుదలతో యాత్రకు బ్రేక్ ఇచ్చారు . ఇప్పుడు మరోసారి బాధితుల వద్దకు వెళుతున్నారు.