CM Revanth Reddy – NITI Aayog : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నీతి అయోగ్ సభ్యులు భేటీ అయ్యారు. సచివాలయంలో ఆయన్ను కలసి రాష్ట్ర పరిస్థితులపై చర్చించారు. రాష్ట్రంలో నిధులు ఎలా వినియోగిస్తున్నారన్న దానిపై సమీక్ష నిర్వహించినట్లు సమాచారం.
కేంద్రం ఇచ్చే నిధులు ఎలా సద్వినియోగం చేస్తున్నారన్నదానిపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీకి తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క హాజరయ్యారు.