EPAPER

Srisailam : వైద్యుల నిర్లక్ష్యం.. శ్రీశైలంలో భక్తుడు మృతి..

Srisailam : వైద్యుల నిర్లక్ష్యం.. శ్రీశైలంలో భక్తుడు మృతి..

Srisailam : దైవదర్శనానికి వచ్చిన ఓ భక్తుడు అస్వస్థతకు గురై వైద్యం అందక మృతి చెందాడు. ఈ ఘటన నంద్యాల జిల్లా శ్రీశైలంలోని ప్రాథమిక వైద్యశాలలో జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కు చెందిన సిద్దంశెట్టి సురేష్ ప్రసాద్ (35) అనే వ్యక్తి కుటుంబంతో కలిసి శ్రీశైల స్వామి దర్శనం కోసం వెళ్లారు. స్వామిఅమ్మవార్ల దర్శనం అనంతరం సాక్షి గణపతి ఆలయ దర్శనానికి వెళ్లాడు.


ఆలయం వద్ద అనారోగ్యంతో ప్రసాద్ పడిపోయాడు. వైద్యం కోసం ప్రాథమిక వైద్యశాలకు తరలించారు. ఈ సమయంలో 108 సిబ్బంది , వైద్యశాల సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. గొడవ కారణంగా సకాలంలో వైద్యులు స్పందించకపోవడంతో సురేష్ ప్రసాద్ మృతి చెందాడు. మృతిని భార్య ఆర్తనాదాలు అక్కడి భక్తులను కలిచివేసింది. వైద్యశాల సిబ్బంది నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×