MAHESH BABU: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే తనకి సంబంధించిన విషయాల్ని, ఫొటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంటున్నారు. అయితే తాజాగా మరొక బ్యూటీఫుల్ ఫొటోను షేర్ చేస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే మరి ఆ అందమైన ఫొటో ఎవరిదనే విషయానికొస్తే..
న్యూ ఇయర్ వేడుకల కోసం సెలబ్రెటీలు విదేశాలకు పయనమయ్యారు. అందులో మహేశ్ దంపతులు ఒకరు.
ఈ సెలబ్రెషన్స్ను మహేశ్ – నమ్రత దంపతులు దుబాయ్లో జరుపుకున్నారు. ఈ ఇందులో భాగంగా మహేష్ తన భార్య నమ్రతని కౌగిలించుకొని.. ఆమెకి ముద్దు పెడుతూ ఉన్న ఓ ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దీంతో ఈ ఫొటో ఇప్పుడు వైరల్గా మారింది. దీనిపై పలువురు నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఖలేజా సినిమాలో మహేష్.. బ్రహ్మానందం ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ హీరోయిన్ అనుష్క ఏడుస్తుంటే.. ఆమెను ఓదారుస్తారు. ఈ స్టిల్ కూడా అచ్చం అలానే ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా.. ఈ ఫొటో మాత్రం అందరినీ బాగా ఆకట్టుకుంది.