రెండు రోజులుగా కనపడని ఓ యువకుడు చెరువులో పడి శవమైతేలాడు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలంలో కలకలం రేపింది. బైరెడ్డిపల్లి మండలం కడపనత్తం గ్రామానికి చెందిన గోపి (17) ఓ హోటల్ యజమాని నాగభూషణం కుమారుడు.
రెండు రోజుల క్రితం గోపి అదృశ్యమైయ్యాడని అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండు రోజుల తర్వాత కడపనతం చెరువులో గోపి శవమైతేలాడు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు అక్కడ చేరుకున్నారు. గోపి మృతదేహాన్ని గుర్తించారు. మృతుడికి మతిస్థిమితం సరిగా లేదని అంటున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.