Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ గుజరాత్ నుంచి వచ్చిన కొందరు దుండగులు రెక్కీ నిర్వహించారనే వార్త రీసెంట్గా నెట్టింట తెగ వైరల్ అయ్యింది. వైసీపీ ప్రభుత్వం పవన్పై కుట్రకు పాల్పడుతుందనే విషయాన్ని జనసేన పార్టీతో పాటు టీడీపీ కూడా ఆరోపించింది. అయితే దీనిపై తెలంగాణ పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ని కారులో ఫాలో అవటమే కాకుండా ఆయన వ్యక్తిగత సిబ్బందితో గొడవ పడ్డ యువకులను అరెస్ట్ చేశారు. చివరకు పవన్ కళ్యాణ్ ఇంటి ముందు రెక్కీని ఎవరూ నిర్వహించలేదని పోలీసులు తేల్చారు. పవన్ కళ్యాణ్ సిబ్బందితో గొడవ పడ్డ సదరు యువకులు మద్యం మత్తులో చేశారని పోలీసులు చెప్పారు. యువకులను పోలీసులు విచారించి వారికి నోటీసులు ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ని చంపటానికి రూ.250 కోట్ల రూపాయలు చేతులు మారాయంటూ వార్తలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. దీంతో జనసేన కార్యకర్తలు, ఫ్యాన్స్ తెగ కంగారు పడ్డారు. ఇది హాట్ టాపిక్గా మారింది. విషయాన్ని సీరియస్గా తీసుకున్న తెలంగాణ పోలీసులు వెంటనే యువకులను అరెస్ట్ చేసి విచారణ చేశారు. మరిప్పుడు జనసేన పార్టీ నాయకులు ఈ విషయం ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.