Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణ శివారు ప్రాంతమైన ఏటిగడ్డ తండా సమీపంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని.. క్షతగాత్రులను చికిత్స కోసం మహబూబాబాద్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వరంగల్ నుంచి మారేడుపల్లి విహారయాత్రకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు సాయిరాం, రవితేజగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.