Hyderabad : ఓ హోటల్ లో వెయిటర్లు షటర్ మూసేసి రాడ్లు, కట్టెలు, కూల్ డ్రింక్ సీసాలతో కస్టమర్లపై దాడికి పాల్పడ్డారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి హైదరాబాద్ లోని అబిడ్స్ పోస్టాఫీస్ వెనుక ఉన్న గ్రాండ్ హోటల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. 30 మంది కస్టమర్లపై వెయిటర్ల విచక్షణారహితంగా దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి.
హోటల్ లో కస్టమర్లపై దాడి ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వెంటనే స్పందించారు. అబిడ్స్ ఇన్స్పెక్టర్ తో మాట్లాడారు. గ్రాండ్ హోటల్ యజమాని , వెయిటర్లను తక్షణమే అరెస్ట్ చేయాలని కోరారు. లేనిపక్షంలో హోటల్కు నిప్పు పెడతామని వార్నింగ్ ఇచ్చారు.