Alert For UPI Users: దేశవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్ విస్తృతమయ్యాయి. చిన్న చిన్న దుకాణాల నుంచి పెద్ద కంపెనీల వరకు పేమెంట్స్ అన్ని డిజిటల్ ద్వారానే జరుగుతున్నాయి. ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్ ఫోన్ పే, పేటీఎం గూగల్ పే ద్వారా ఆన్లైన్ చెల్లింపులు కోట్లలో జరుగుతున్నాయి.
Alert For UPI Users: దేశవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్ విస్తృతమయ్యాయి. చిన్న చిన్న దుకాణాల నుంచి పెద్ద కంపెనీల వరకు పేమెంట్స్ అన్ని డిజిటల్ ద్వారానే జరుగుతున్నాయి. ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్ ఫోన్ పే, పేటీఎం గూగల్ పే ద్వారా ఆన్లైన్ చెల్లింపులు కోట్లలో జరుగుతున్నాయి. కోట్లాది మంది యూజర్లు కలిగి ఉన్న ఈ యాప్స్ నూతన సంవత్సరం జనవరి 1 నుంచి న్యూ ఇయర్ రూల్స్ తీసుకొచ్చింది. ఆ మార్పులు ఏంటో తెలుసుకుందాం.
ఫోన్ పే, గూగుల్ పేలకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ బ్యాంక్ ఇటీవల కలక ప్రకటన చేసింది. డిసెంబర్ 31-2023 వరకు యాక్టివ్లో లేని యూపీఐలు పనిచేయవని తెలిపింది. నూతన ఏడాది ప్రారంభం వేళ జనవరి 1 నుంచి సంవత్సరం పాటు ఏవిధమైన లావాదేవీలు జరగని యూపీఐ ఖాతాలు మూసివేయబడతాయని ప్రకటించింది.
ఆలస్యమైన ఐటీఆర్ ఫైల్ చేయడానికి వాస్తవానికి డిసెంబర్ 31వ తేదీ ఆఖరు. కాబట్టి ఐటీఆర్ ఫైలింగ్ కోసం జనవరి 1 నుంచి పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.
సిమ్ కార్డ్ మోసాలకు బ్రేక్ వేసేందుకు కేంద్రం కొత్త రూల్స్ తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. టెలికమ్యూనికేషన్ శాఖ పేపర్ ఆధారతి కేవైసీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో జనవరి 1 నుంచి కొత్త సిమ్ కార్డ్ పొందడానికి డిజిటల్ కేవైసీని చేయాల్సి ఉంటుంది.