Kamareddy : న్యూఇయర్ వేడుకల్లో పాట కారణంగా తలెత్తిన గొడవలో ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి పాట విషయంలో తలెత్తిన గొడవ కారణంగా సాదుల రాములు అనే కాంగ్రెస్ నేతను నలుగురు బీఆర్ఎస్ నేతలు హత్య చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన నసురుల్లాబాద్ మండలం నాచుపల్లిలో జరిగింది.
రాములు హత్యతో గ్రామంలో ఇరు వర్గాల మధ్య గొడవ తీవ్రస్థాయికి చేరింది. అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున పోలీసుల మోహరించి గొడవలు తలెత్తకుండా చూస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని మృతుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.