Mudragada Padmanabham : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇంటికి అభిమానులు భారీగా క్యూ కడుతున్నారు. ఆయన మళ్లీ రాజకీయ ఎంట్రీ ఇస్తారనే సంకేతాలతో కిర్లంపూడిలో సందడి వాతావరణం కనిపిస్తోంది. నాలుగేళ్ల తర్వాత న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం అభిమానులను ఆహ్వానించారు ముద్రగడ పద్మనాభం. ఇటీవల కాలంలో ముద్రగడ వైసీపీకి దగ్గరగా మసలుతున్నారు. వైసీపీ నేతలు పలువురు గతంలో ముద్రగడను కలిసి చర్చలు జరిపారు.
2009 తర్వాత నుంచి క్రియాశీల రాజకీయాలకు ముద్రగడ దూరంగా ఉంటున్నారు. అడపదడపా ప్రెస్ మీట్లు పెడుతూ మాత్రమే కనిపించారు. ముఖ్యంగా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కల్యాణ్పై విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. నాలుగేళ్ల తర్వాత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి అభిమానులను ఆహ్వానించడంతో ముద్రగడ ఏం చెప్తారు? అసలు పొలిటికల్ రీఎంట్రీ ఉంటుందా? ఉంటే పోటీ చేస్తారా అంటూ చర్చించుకుంటున్నారు అభిమానులు.
ముద్రగడతోపాటు ఆయన తనయుడు కూడా వైసీపీలో చేరతారనే ప్రచారం సాగుతోంది. తండ్రీకొడుకులకు వైసీపీ టిక్కెట్లు ఆఫర్ చేసిందా? ఈ నేపథ్యంలోనే ఆ పార్టీలోకి చేరేందుకు ముద్రగడ రంగం సిద్ధం చేసుకుంటున్నారా? ఇప్పుడు ఈ అంశాలపై చర్చ నడుస్తోంది.