CM Revanth Reddy : హైదరాబాద్ బేగంపేటలోని ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా న్యూఇయర్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. నూతన ఏడాదిలో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సీఎం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2024ను ‘రైతు-మహిళ- యువత’ నామ సంవత్సరంగా సంకల్పం తీసుకున్నామని చెప్పారు సీఎం రేవంత్.
న్యూ ఇయర్ వేళ సీఎం రేవంత్రెడ్డి నివాసానికి ప్రముఖుల రాక పెరిగింది. పలువురును సీఎంకి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతున్నారు. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.