SAMSUNG OFFER: మార్కెట్లోకి కొత్త ఫోన్ వచ్చిందంటే చాలు.. చాలా మంది మొబైల్ ప్రియులు కొనుక్కోవాలని చూస్తుంటారు. అయితే ధర ఎక్కువగా ఉండటంతో కొనేందుకు ఇష్టపడరు. ఈ మేరకు కంపెనీ ఎప్పుడెప్పుడు డిస్కౌంట్లు ప్రకటిస్తుందా? అంటూ ఎదురుచూస్తుంటారు. అలాంటి వారికి గుడ్ న్యూస్. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ సామ్ సంగ్ కొత్త ఫోన్ కొనుక్కోవాలనుకునే వారికి అదిరే ఆఫర్ ప్రకటించింది.
Samsung తన స్మార్ట్ఫోన్ Samsung Galaxy A54 5G ఫోన్ను మార్చిలో ప్రారంభించింది. ఈ మొబైల్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి రాగా.. వీటి ధరల్లో పెద్ద కోత పెట్టింది. దీని 8GB, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.38,999, అలాగే 8GB, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.40,999గా నిర్ణయించింది. ఇప్పుడు ఈ ఫోన్ల ధరలపై రూ.2000 తగ్గించింది. దీంతో ధర తగ్గింపు తర్వాత వాటి ధర రూ.36,999, రూ.38,999గా మారింది. ఫోన్ కొత్త ధరలను కంపెనీ అధికారిక వెబ్సైట్లో చూడవచ్చు.
ఈ ఫోన్ను వండర్ వైట్, వండర్ లైమ్, వండర్ వైలెట్, వండర్ గ్రాఫైట్ కలర్ ఆప్షన్లలో సొంతం చేసుకోవచ్చు. విశేషమేమిటంటే.. ఫోన్ ప్రియులు ఈ మొబైల్ను యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్తో కొంటే అదనంగా రూ.2,000 తగ్గింపును కూడా పొందవచ్చు. దీంతో తగ్గింపు ధరలో మంచి రేంజ్ కలిగిన స్మార్ట్ ఫోన్ను కొనాలనుకునే వారికి ఇదొక మంచి డిస్కౌంట్ అనే చెప్పాలి.
256GB స్టోరేజ్ కలిగివున్న ఈ ఫోన్ని మైక్రో SD కార్డ్ ఉపయోగించి 1 TB వరకు విస్తరించవచ్చు. Android 13లో పని చేస్తుంది. 120Hz రిఫ్రెష్రేట్, విజన్ బూస్టర్ సపోర్ట్తో 6.4 అంగుళాల ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. అంతేగాక ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ను కలిగి ఉంది. ఇందులో f/1.8 ఎపర్చరుతో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, f/2.2 ఎపర్చర్తో కూడిన 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్, 5-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు.