EPAPER

Munugodu Vote Counting : ఉదయం 8గంటల నుంచి లెక్కింపు స్టార్ట్.. మధ్యాహ్నం కల్లా ఫలితం..

Munugodu Vote Counting : ఉదయం 8గంటల నుంచి లెక్కింపు స్టార్ట్.. మధ్యాహ్నం కల్లా ఫలితం..

Munugodu Vote Counting : మునుగోడు ఓటింగ్ పూర్తయింది. ఆదివారం మధ్యాహ్నం కల్లా మునుగోడు ఫలితం వెలువడే అవకాశం ఉందని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. ఎప్పుడూ లేనంతగా పోలింగ్ శాతం నమోదైంది. 93.13 శాతం పోలింగ్ నమోదైంది. 2018తో పోలిస్తే.. ఇది అధిక పోలింగ్ రేటు. గురువారం అర్ధరాత్రి 1.30గంటల వరకు పోలింగ్ నడిచింది.


ఇక కౌంటింగ్.. ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. కౌంటింగ్‌కు 21 టేబుళ్లు ఏర్పాటు చేయనున్నారు. 298 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది. ఈ కేంద్రాల్లోని అన్ని ఈవీఎంలలోని ఓట్లను 15 రౌండ్లలో లెక్కిస్తారు. ఉదయం 9 గంటల తొలి రౌండ్ ఫ లితం.. మధ్యాహ్నం 1 గంటకల్లా గెలుపోటములు దాదాపు తేలిపోనున్నట్లు తెలుస్తోంది.

మునుగోడు ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓట్లను లెక్కించే సిబ్బందికి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలో భద్రపరిచి.. సీఆర్పీఎఫ్ జవాన్లను కాపలాగా ఉంచారు. చౌటుప్పల్ మండలంలోని ఓట్లను మొదటగా లెక్కించనున్నట్లు సంబంధిత అధికారులు చెప్పారు. మునుగోడు ఉపఎన్నికలో మొత్తం 2లక్షల 41 వేల 805 ఓట్లు ఉన్నాయి. వీటిలో 2లక్షల 25వేల 192 ఓట్లు పోల్ అయ్యాయి.


Tags

Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×