Taloja Jail Lakdawala : నేరం ఎవరు చేసినా నేరమే.. చట్టం, న్యాయం ముందు అందరూ సమానమే.. ఈ వాక్యం అర్ధం దావూద్ ఇబ్రహీం అనుచరుడు ఎజాజ్ లక్డావాలాకు బాగా అర్ధమైంది అనుకుంటా. ముంబయిలోని తలోజా జైల్లో తనను కాటేసిన దోమలను కోర్టుకు తీసుకువచ్చి.. న్యాయం చేయమని జడ్జిని కోరాడు.
తలోజా జైళ్లో దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. అక్కడి ఖైదీలు దోమలతో తీవ్రఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొందరికి రాత్రి నిద్రపట్టడం లేదు. లక్డావాలా తన వెంట అక్కడున్న కొన్ని దోమలను బాటిల్లో బంధించాడు..వాటిని కోర్టుకు తీసుకువచ్చాడు. తనకు దోమతెరను ఏర్పాటు చేయాలని జడ్జిని కోరాడు.
అయితే గతంలో జైలుసిబ్బంది లక్డావాలాకు దోమతెరను ఏర్పాటు చేశారు. కానీ కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా దాన్ని తొలగించారు. గ్యాంగ్స్టర్ ఎజాజ్ లక్డావాలా.. ముంబయి డాన్ దావూద్ ఇబ్రహీంకు అనుచరుడిగా ఉండేవాడు. 2020 జనవరిలో అరెస్టయి.. అప్పటి నుంచి నవీ ముంబయిలోని తలోజా జైల్లో ఉంటున్నారు. లక్డావాలా అభ్యర్ధనను విన్న జడ్జి.. దోమతెరకు ప్రత్యామ్నాయంగా.. మస్కిటో కాయిల్స్, ఒడొమొస్ లాంటి వాటిని ఉపయోగించమని సలహా ఇచ్చారు.