police guidelines : కొత్త సంవత్సర ప్రారంభ వేడుకలకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లోని ప్రధాన సెంటర్ లలో పోలీసులు నిఘా పెంచారు. ముఖ్యమైన ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. యువకులు మితి మీరిన వేగంతో వాహనాలు నడుపవద్ధని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. అంతే కాకుండా వేగాన్ని నియంత్రించడానికి ప్రధాన రహదారుల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు.
మద్యం తాగి వాహనాలు నడుపవద్దని.. ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టు బడితే భారీ జరిమానా చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. రాత్రి 2 గంటల వరకు అన్ని నగరాలు పోలీసుల పర్యవేక్షణలో వుంటాయని పోలీసు అధికారులు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని సూచించారు.