Hyderabad drug bust : నూతన సంవత్సర వేడుకలకు జూబ్లీహిల్స్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్ నుంచి తీసుకువచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్న ఇద్దరు విద్యార్థులను టాస్క్ పోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్లో ప్రముఖ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు సూరి లీల నవీన్, వీర సాయి తేజలు ఈ ముఠాలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. 29 గ్రాముల బ్రౌన్ షుగర్ ప్యాకేట్స్ , 100 గ్రాముల ఎండీఎంఏ, ప్యాకెట్స్ ను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు.
Hyderabad drug bust : నూతన సంవత్సర వేడుకలకు జూబ్లీహిల్స్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్ నుంచి తీసుకువచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్న ఇద్దరు విద్యార్థులను టాస్క్ పోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్లో ప్రముఖ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు సూరి లీల నవీన్, వీర సాయి తేజలు ఈ ముఠాలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. 29 గ్రాముల బ్రౌన్ షుగర్ ప్యాకేట్స్ , 100 గ్రాముల ఎండీఎంఏ, ప్యాకెట్స్ ను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు.
న్యూఇయర్ వేళ డ్రగ్స్ విక్రయంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రగ్స్ను సేవిస్తే గుర్తించేందుకు ప్రత్యేక పరికరాలు సైతం తెప్పించామని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ తీసుకున్నారన్న అనుమానం వస్తే చాలు అక్కడిక్కడే పరీక్షలు నిర్వహించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై వచ్చే వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. విద్యార్ధులపై ప్రత్యేక దృష్టి సారించారు.