Jangaon : పొట్టకూటికి పిట్టలను కొట్టి వాటిని ఆహారంగా తీసుకుని జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి గురి తప్పడం వల్ల అరెస్టు అయ్యాడు. జనగం జిల్లా కాజీపేటలోని అంబేడ్కర్ నగర్ కు చెందిన హరిబాబు అనే వ్యక్తి పిట్టలను కొటి వాటిని ఆహారంగా తీసుకునేవాడు. రాయితో పిట్టను కొట్టబోయి పొరపాటున వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు తాగిలింది. దాంతో శనివారం కాజీపేట ఆర్పీఎఫ్ పోలీసులు హరిబాబును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
స్థానిక సీఐ సంజీరావు తెలిపిన వివరాల ప్రకారం .. జనగామ సమీపంలో శుక్రవారం పిట్టలను కొట్టడానికి గులేరులో రాయితో ప్రయత్నించాడు పోరపాటున గురి తప్పి విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళుతున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు తగిలి అద్దం పగిలింది. ఘటన జరిగిన ప్రాంతాంలో విచారించగా హరిబాబు చేసినట్టు తేలింది. గులేరును సీజ్ చేసి హరిబాబును అరెస్టు చేశారు.