New Year 2024: న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాలు రెడీ అవుతున్నాయి. కొత్త సంవత్సరానికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు అంతా ఎవరి ప్లాన్స్ లో వాళ్లు సిద్దం అవుతున్నారు. మరి ముఖ్యంగా హైదరాబాద్ లో నూతన సంవత్సర వేడుకల్లో ఎంజాయ్ చేసేందుకు ప్రత్యేకించి యూత్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే వారికి పోలీసులు.. గతానికి భిన్నంగా ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్పై పోలీసులు గట్టి నిఘా పెట్టి ఊహించని షాక్ ఇస్తున్నారు. డ్రగ్స్ వినియోగంపై ఉక్కుపాదం మోపేందుకు కొత్త టెక్నిక్స్ తో వస్తున్నారు.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రీత్యా హైదరాబాద్లో ప్రత్యేక ఆంక్షలు విధించారు పోలీసులు. పబ్బులు, క్లబ్బులు, బార్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే నగర శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు.. కొత్త టెక్నిక్ లతో రంగంలోకి దిగుతున్నారు. డ్రగ్స్, డ్రంక్ అండ్ డ్రైవ్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోబోతున్నారు. ఈసారి సరికొత్తగా పరీక్షలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు హైదరాబాద్ పోలీసులు.
డ్రగ్స్ వినియోగించినవారిని గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతిక పరికరాలను ఇప్పటికే టీఎస్ న్యాబ్ రెడీ చేసింది. కోట్ల రూపాయలతో డ్రాగర్.. అబొట్.. అనే పరికరాలతో స్పాట్లోనే డ్రగ్స్ వినియోగించారా.. లేదా.. అనే విషయాన్ని తేల్చనున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు 25 చొప్పున ఈ పరికాలను అందజేశారు. పబ్, రిసార్ట్, చౌరస్తాల దగ్గర తనిఖీలు చేసి డ్రగ్స్ వినియోగదారులను పసిగట్టనున్నారు పోలీసులు.