Kodangal : తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ జీవో విడుదల చేసింది. కొడంగల్ నియోజకవర్గంతోపాటు వికారాబాద్, నారాయణ్పేట్ జిల్లాల అభివృద్ధి కోసమే దీనిని ఏర్పాటు చేసింది రేవంత్ సర్కార్. కొడంగల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ ఛైర్మన్గా వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఉండనున్నారు
కాడా..KADA ( కొడంగల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ) కోసం ప్రభుత్వం ఓ స్పెషల్ ఆఫీసర్ను ఏర్పాటు చేయనుంది. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఓ మాస్టర్ ప్లాన్ రూపొందించి.. దానిని అమలు చేయనున్నారు. ప్రభుత్వ కార్యాక్రమాలను ఖచ్చితంగా అమలు చేయడం.. సీసీ రోడ్లు, డ్రైనేజీలతోపాటు ఇతర మౌలిక సదుపాయాలను కల్పించడం కూడా కాడా భుజానికెత్తుకోనుంది. యువతలో వృత్తి నైపుణ్యాలను పెంచేందుకు ప్రత్యేక స్కీమ్లను రూపొందించనున్నారు.