Cm Revanth Reddy : అభయహస్తం దరఖాస్తులు అమ్మకాలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అభయహస్తం దరఖాస్తులు అమ్మే వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
Cm Revanth Reddy : అభయహస్తం దరఖాస్తులు అమ్మకాలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి సచివాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అభయహస్తం దరఖాస్తులు అమ్మే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
పాత లబ్ధిదారులకు పథకాలు యథాతథంగా అమలవుతాయని సృష్టం చేశారు. కొత్తగా లబ్ధిదారులు ఉంటే పథకాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రైతుభరోసా, పెన్షన్లపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందుతాయని సీఎం రేవంత్ రెడ్డి హామీఇచ్చారు.