Pawan Kalyan : ఏపీలో ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం భారీ గా అవకతవకలు జరిగాయని పవన్ కళ్యాణ్ విమర్మించారు. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ కి లేఖ రాశారు. ఇళ్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని లేఖలో పేర్కొన్నారు.
Pawan Kalyan : ఏపీలో ఇళ్ల నిర్మాణంలో భారీగా అవకతవకలు జరిగాయని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇళ్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని లేఖలో పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాలపై వాటి నిర్మాణంపై పొంతన లేని విభిన్న ప్రకటనలు జారీ చేస్తుందన్నారు పవన్ . కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయిస్తే అసలు నిజాలు బయటపడతాయన్నారు. గతంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా పూర్తిగా లబ్ధిదారులకు మంజూరు చేయలేదని విమర్శించారు. మొత్తం 6.68 లక్షల టిడ్కో ఇళ్లలో కేవలం 86,984 ఇళ్లను మాత్రమే లబ్ధిదారులకు అందించినట్లు లేఖలో జనసేనాని పేర్కొన్నారు.
ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న వేల అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. శుక్రవారం భీమవరంలో జరిగిన సభలో పవన్ కల్యాణ్ పై సీఎం జగన్ ఘాటు విమర్శలు చేశారు. కార్లు మార్చినట్లు భార్యలను మారుస్తున్నారని విమర్శించారు. అటు పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై ఆరోపణస్త్రాలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి లేఖరాశారు. ఇలా వైసీపీ, జనసేన మధ్య డైలాగ్ వార్ ఏపీలో పొలిటికల్ హీట్ ను మరింత పెంచుతోంది.