Secunderabad: సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం పాస్పోర్టుల జారీలో దేశంలోనే ఐదో స్థానంలో నిలిచిందని ప్రాంతీయ పాస్పోర్టు అధికారిణి (ఆర్పీవో) జొన్నలగడ్డ స్నేహజ ప్రకటించారు. దేశంలోని మొత్తం
37 ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయాల్లో మొదటి నాలుగు స్థానాల్లో ముంబయి, బెంగళూరు, లఖ్నవూ, చండీగఢ్ కార్యాలయాలు ఉన్నట్టు ఆమె ప్రకటించారు. 2023లో పాస్పోర్టు కార్యాలయం అందిస్తున్న సేవలు గురించి ఆర్పీవో మీడియా సమావేశంలో వివరించారు.
పాస్పోర్టుల జారీలో దేశంలోనే సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం ఐదో స్థానంలో నిలిచిందని ప్రాంతీయ పాస్పోర్టు అధికారిణి (ఆర్పీవో) జొన్నలగడ్డ స్నేహజ ప్రకటించారు. దేశంలోని మొత్తం 37 ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయాల్లో మొదటి నాలుగు స్థానాల్లో ముంబయి, బెంగళూరు, లఖ్నవూ, చండీగఢ్ కార్యాలయాలు ఉన్నట్టు ఆమె ప్రకటించారు. 2023లో పాస్పోర్టు కార్యాలయం అందిస్తున్న సేవలు గురించి ఆర్పీవో మీడియా సమావేశంలో వివరించారు.
పాస్పోర్టుల కోసం మధ్యవర్తులను సంప్రదించి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మధ్యవర్తులకు అవకాశం లేకుండా పాస్పోర్టుల జారీ కోసం నూతన విధానాలను అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 7,85,485 పాస్పోర్టులు జారీ చేసినట్లు ఆమె వెల్లడించారు.
గతంతో పోలిస్తే ఈ ఏడాది 1,42,328 పాస్పోర్టులు అత్యధికంగా జారీ చేశామని తెలిపారు. దళారుల వ్యవస్థను పూర్తిగా ఆరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. పుట్టిన తేదీని ఆధార్ ఆధారంగా పరిగణనలోకి తీసుకోవడం జరగదని సృష్టం చేశారు. పాస్పోర్టులు తత్కాల్ విధానంలో జారీ చేసేందుకు 4 నుంచి 5 రోజులు సమయం పడుతోందన్నారు. సాధారణ పాస్ పోర్టులు జారీ చేయడానికి దాదాపు 22 రోజుల సమయం పడుతున్నట్టు ఆమె ప్రకటించారు.