Covid Death : ఆంధ్రప్రదేశ్ లోని పుట్టపర్తిలో కరోనా కలకలం రేగింది. సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో యూకే కు చెందిన భాస్కర్ జోషి కరోనాతో మృతి చెందారు. అనారోగ్య కారణంగా ఆసుపత్రిలో చేరిన ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా కరోనా అని తేలింది. పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందారు.
మృతునికి పిల్లలు లేరు. భార్య మాత్రమే ఉంది. విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులతోపాటు లండన్ ఎంబసీకి టౌన్ పోలీసులు మెసేజ్ ద్వారా తెలియజేశారు. దేశ విదేశీ భక్తులతో నిత్యం రద్దీగా ఉండే పుట్టపర్తిలో ఈ ఏడాది తొలి కరోనా కేసు నమోదు కావడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది.